Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం
న్యూఢిల్లీ: మానవాభివృద్ధి సూచీ(హెచ్డీఐ)లో గుజరాత్ వెనకబడిం దని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం విమర్శించారు. బీజేపీ పాలనలో(గడచిన 22 ఏండ్లలో) గుజరాత్ అభివృద్ధి పతనమైనట్టు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధిం చిన గణాంకాలు, ఇతర సమాచారాన్ని విడుదల చేశారు. కర్నాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల గణాంకాలతో గుజరాత్ గణాంకాలను పోల్చి చూశారు. ఈ లెక్కలు చూస్తే గుజరాత్ మోడల్ అభివృద్ధి బూటకమని తెలిసిపోతున్నదని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి రాకముందే గుజరాత్ అభివృద్ధి చెందిందని, అమూల్, నౌకాశ్రయాలు, వస్త్ర పరిశ్రమలు అభివృద్ది చెందాయని, దీంతో కొన్ని సామాజికవర్గాల స్థితిగతులు మెరుగయ్యాయని వివరించారు. కానీ కొన్ని వర్గాలు ఇంకా అభివృద్ధికి దూరంగా ఉన్నాయని చెప్పారు. అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని చెప్పారు.
ఎన్నికల హామీలు ఏమయ్యాయి మోడీ !
ప్రధాని అయితే అందరి ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున వేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఏమైందంటూ మోడీని చిదంబరం ప్రశ్నించారు. ఇప్పటివరకూ ఎంత నల్లధనం వెనక్కి తెచ్చారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలిపారు. ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, డిసెంబరులో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం కనిపిస్తుందని ఆయన ట్వీట్ చేశారు.