Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: భారత్లోని జైళ్లలో మగ్గుతున్న విదేశీ ఖైదీల వివరాలపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని కేంద్రాన్ని భారత సర్వోన్నత న్యాయ స్థానం ఆదేశించింది. శిక్ష గడువు ముగి సినా పలువురు విదేశీయులు ఇంకా జైళ్లలోనే మగ్గుతుండడం పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ సహా వివిధ దేశాలకు చెందిన వారు తమ శిక్షను పూర్తి చేసినా.. జైళ్లలోనే ఉన్నారని, వారిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ భీమ్సింగ్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని పై న్యాయమూర్తులు ఎకె సిక్రి, అశోక్ భూషణ్ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ యేడాది మే 3న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నాలుగు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాక.. జైలు శిక్ష పూర్తి చేసుకున్న 61మంది పాక్ దేశస్థులను విడు దల చేసి, వారి సొంత ప్రాంతానికి తరలించాలని ధర్మాసనం ఆదేశించిం ది. దేశంలోని వివిద జైళ్లలో ఉన్న విదేశీఖైదీల వివరాలపై చివరిసారిగా గతేడాది ఏప్రిల్లో కేంద్రం ఓ స్టేటస్ రిపోర్టును సమర్పించింది.