Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆకట్టుకున్న భారతీయ నర్తనోత్సవం
రాజమహేంద్రవరం: తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధన కోసం భారతీయ నర్తనోత్సవం పేరుతో ఏపీలోని రాజమహేంద్రవరం ఆనంకళా కేంద్రంలో ఆదివారం 14గంటల పాటు ఏకధాటి గా సాగిన నృత్యాలు నాట్య గురువులకు నృత్య నీరాజనం పలికాయి. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 610 మంది నృత్య కళాకారులు, 65 మంది గురువులతో ఆనం కళాకేంద్రం కళకళలాడింది. కూచి పూడి, భరతనాట్యం, ఓడిస్సీ, మణిపూరి, కథక్, మోహినీ అట్టం మొదలైన భారతీ య సంప్రదాయ నృత్య ప్రదర్శనలను ఒకే వేదికపై ప్రదర్శించారు. డాక్టర్ వేదాం తం మోహన సత్య శ్రీనివాస వాగ్దేవి ప్రసాద్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ పి.స్వాతి భరద్వాజ్, కంకిపాడుకు చెందిన నందిరాజు కావ్యకళ కూచిపూడి ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. అంతకుముందు భారతీయ నర్తనోత్సవాన్ని తాళ్లపాక శేషాదర రవి కుమారాచార్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇ, ప్రముఖ నాట్యాచార్యుడు డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ కళల రాజధాని రాజమహేంద్రవరంలో జాతీయ స్థాయి నాట్య శిక్షణా సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.