Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైక్పై వచ్చి దాడి చేసిన నిందితులు
తిరువనంతపురం: కేరళలో ఆదివారం ఉదయం సీపీఐ(ఎం) కార్య కర్తపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించిన సీసీటీవి వీడియో వైరల్ అవుతోంది. దేశాభిమాని పత్రిక పంపిణీ ఏజెంట్ అయిన సీపీఐ(ఎం) కార్యకర్త కుమార్... ఎప్పటిలానే ఉదయం ఆరుగంటల ప్రాంతంలో ఇంటింటికీ పత్రిక వేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తిరువనంతపురం శివారులోని కట్టకడ వద్ద దాడికి చేసినట్టు వీడియోలో స్పష్టమైంది. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి ఆయు ధంతో కొట్టడంతో కుమార్ కిందకి పడిపోయాడు. అనంతరం అక్కడ నుంచి నిందితులు పరారయ్యారు. వీరు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ)కి చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.