Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రమేష్ సంతాప సభలో బివి.రాఘవులు
విశాఖపట్నం: సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్కు ఏ పని అప్పగించినా సక్రమంగా బాధ్యతలు నిర్వహించారని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. అధిక పరిశ్రమలు కలిగిన విశాఖపట్నంలోని ట్రేడ్ యూని యన్, ఏజెన్సీలోని గిరిజన సమస్యలు, తీర ప్రాంతం లోని మత్స్యకారులు, రైతుల సమస్యలు, అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడారు. ఆదివారం ఎయు అసెంబ్లీ హాలులో సీపీఐ(ఎం) ఆధ్వర్యాన రమేష్ సంతాప సభ నిర్వహించారు. ఈ సభకు రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణాన్ని వదిలి గిరిజన సమస్యలపై పనిచేయాలన్నా ఆయన వెనుకాడలేదన్నారు. రమేష్ చిన్నతనంలో నేర్చు కున్న నైపుణ్యాలను ప్రజా సేవలకు అంకితం చేశార న్నారు. విద్యార్థి దశలో కృష్ణా కాలేజీలో ఎస్ఎఫ్ఐ, తర్వాత ట్రేడ్ యూనియన్లో చురుకైన పాత్ర పోషించాడని చెప్పారు. సీపీఐ(ఎం) మహాసభల ఏర్పాట్లలో భౌతికంగా పనిచేసి ఇతరులకు ఆదర్శ ంగా నిలిచాడన్నారు. విశాఖ తీరంలో పెట్రో కారి డార్, సెజ్ల్లో బ్రాండిక్స్్ తదితర కంపెనీల వల్ల మత్స్యకారులు, రైతులు, కార్మికుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని చెప్పారు. ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో వయసు మళ్లిన వారికి కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేవని, ఇప్పుడు 40 ఏళ్లకే వస్తున్నాయని, వీటిపై ప్రజాసేవకు అంకితమైన వారంతా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. బిపి, షుగర్, స్థూల కాయం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత ఆరోగ్యం సేవలను ప్రక్షాళన చేసి మరింత మెరుగైన వ్యవస్థకోసం మనమంతా పాటు పడాలని పిలుపు నిచ్చారు. 3 రోజులు విశాఖలో అగ్రి హ్యాకథాన్ సదస్సులో కార్పొరేట్ వ్యవసాయంపై మాట్లాడారు తప్ప ఆహార పంటలపై పురుగుల మందుల వాడకం, వాటి దుష్పలితాలతో వస్తున్న కేన్సర్లు గురించి చర్చించలేదన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, చౌదరి తేజేశ్వరరావు, సిఐటియ రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వరరావు తదితరులు ఉద్వేగానికి లోనయ్యారు.