Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో 20 మంది పాటీదార్లకు చోటు
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. ఆదివారం రాత్రి పొద్దుపోయాక కాంగ్రెస్ పార్టీ ఈ జాబితాను విడుదల చేసింది. పాటీదార్ల సామాజిక వర్గానికి చెందిన 20 మందికి ఈ జాబితాలో చోటుకల్పించింది. ఏ ఏ స్థానాల్లో ఎవెరెవరికి పార్టీ అభ్యర్థిత్వం దక్కిందనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరో వైపు పార్టీ సంస్థాగత ఎన్నికలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏర్పాట్లు వేగం పుంజు కున్నాయి. సోమవారం నాడు పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్నారని సమాచారం. పదిరోజుల్లో ఎన్నికలను ప్రక్రియను ముగించాలన్న ఉద్దేశంలో కాంగ్రెస్ ఉన్నతస్థాయి నాయకులు ఉన్నారు. పార్టీ అధ్యక్ష స్థానానికి రాహుల్గాంధీ నామినేషన్ వేయటం, ఎన్నికవటం దా దాపు ఖాయమైపోయింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమి టీ (పీసీసీ)లు రాహుల్ అభ్యర్థిత్వంపై ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి.