Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్యానాలో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చండీగఢ్: బన్సాలీ దర్శక త్వంలో తెరకెక్కిన 'పద్మావతి' చిత్రంపై దుమారం కొనసా గుతూనే ఉన్నది. చిత్ర యూనిట్ను రాజ్పుత్ కర్ణిసేన కార్యకర్తలు కొంతకా లంగా బెదిరింపులకు గురి చేస్తుండగా.. ఆ జాబితాలో బీజేపీ కూడా చేరిపోయింది. పద్మావతి దర్శకుడు బన్సాలీ, హీరోయిన్ దీపికా పదుకొనే తల నరికి తెచ్చిన వారికి రూ.10 కోట్లు ఇస్తానంటూ బీజేపీ హర్యానా చీఫ్ మీడియా కో ఆర్డినేటర్ సూరజ్ పాల్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీపిక, బన్సాలీల తల నరికితే రూ.5 కోట్లు రివార్డు ఇస్తానని ప్రకటించిన మీరుట్ యువకుడికి అభినందనలు తెలిపారు. అంతేకాక, 'దీపికా.. నీ ముక్కు కోస్తాం' అంటూ కర్ణిసేన కార్యకర్తలు చేసిన బరితెగింపు వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. చరిత్రను వక్రీకరించిన తీసిన పద్మావతి సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయనీయబోమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు.. తగిన మార్పులు చేయకుండా సినిమా విడుదల చేయవద్దని కోరుతూ.. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి రాజస్థాన్ సీఎం వసుంధర రాజే లేఖ రాశారు.