Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లెఫ్టినెంట్ జనరల్ జెఎస్ సంధు
శ్రీనగర్: ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లతో కాశ్మీర్ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోందని లెఫ్టినెంట్ జనరల్ జెఎస్ సంధు అన్నారు. ఈ యేడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు జమ్మూకాశ్మీర్లో 190 మంది ఉగ్రవాదులు హతమైనట్టు వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 190 మంది ఉగ్రవాదుల్లో 80 మంది స్థానికులని, 110 విదేశీయులని చెప్పారు. హతమైన వారిలో 66 మందిని దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తుండగా మట్టుబెట్టినట్టు వివరించారు. అంతేకాక, దాదాపు 80 మంది ఉగ్రవాదులు కాశ్మీర్ లోయలో జరిగిన ఎదురుకాల్పుల్లోనే చనిపోయారని తెలిపారు. మరోవైపు.. ఉగ్రవాద సంస్థల్లో చేరిన స్థానిక యువకులకు తిరిగి రావాలని సంధు కోరారు. తల్లి కోరిక మేరకు ఇటీవల భద్రతాదళాల ఎదుట లొంగిపోయిన ఫుట్బాల్ క్రీడాకారుడిని ఈ సందర్భంగా ఉదాహరణగా చూపించారు. స్థానిక యువకులు ఉగ్రవాదాన్ని వదిలి వస్తే.. వారిని గౌరవంగా స్వీకరిస్తామని తెలిపారు. బండిపోరా జిల్లాలో శనివారం జరిగిన భీకర ఎన్కౌంటర్లో 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి లఖ్వి మేనల్లుడు సహా ఆరుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.