Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు ఈ యేడాది ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించింది. 2004 నుంచి 2014 మధ్య కాలంలో భారత్కు నాయకత్వం వహించిన మన్మోహన్ ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ స్థాయిని పెంచడానికి చేసిన కృషికిగానూ ఈ అవార్డు లభించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ కమిటీ ఈ అవార్డుకు మన్మోహన్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్టు ఒక ప్రకటనలో తెలిపింది. మన్మోహన్సింగ్ తన నాయకత్వంలో ఇరుగు పొరుగు దేశాలతో పాటు, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ భారత్ను గొప్పగా నిలిపారని తెలిపింది. రెండు పర్యాయాలు పూర్తి పదవీకాలం అనుభవించిన మూడో భారత ప్రధాని మన్మోహన్ అని తెలిపింది.