Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యసభలో సచిన్, రేఖల హాజరు అంతంతే..
- ఒక్కసారి కూడా నోరు విప్పని బాలీవుడ్ నటి రేఖ
న్యూఢిల్లీ: సచిన్ను క్రికెట్ దేవుడిగా కొలుస్తుం టారు. బాలీవుడ్ నటి రేఖలో తరగని అందాన్ని ఆరా ధిస్తుంటారు. వీరిద్దరి సేవల్ని గుర్తించి రాజ్యసభకు పంపితే.. ప్రజా సమస్యలెంతవరకు ప్రస్థావించారు? జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఇద్దరు టాప్ సెలబ్రిటీలు పెద్దల సభలో ఎంతవరకు సక్సెస్ అయ్యారో చూద్దాం. రేఖ, సచిన్ల రాజ్యసభ సభ్యత్వం ముగియడా నికి ఇంకా ఆరు నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నది. ఆయా రంగాల్లో టాప్ పొజిషన్లో ఉన్నా రాజ్యసభ సమావేశాల్లో మాత్రం వీరిద్దరూ వెనుకబడి ఉన్నారు. ఈ ఐదున్నరేండ్ల కాలంలో సచిన్ ఏడు శాతం, రేఖ ఐదు శాతం సమయం మాత్రమే హాజర య్యారు. ఈ సమావేశాల్లో 22 సార్లు పలు అంశాల పై సచిన్ ప్రస్థావిస్తే.. రేఖ మాత్రం అస్సలు నోరు విప్పలేదు. ఇలా ఎక్కువసార్లు గైర్హాజరు కావటమే కాదు.. సచిన్ రెండుసార్లు, రేఖ ఓసారి సెలవులు కోరుతూ ఆర్జీలు దాఖలు చేశారట. 2012 ఏప్రిల్ నుంచి 2017 ఆగస్టు వరకు రాజ్యసభ 373 సార్లు భేటీ అయింది. సచిన్ 25 సార్లు మాత్రమే హజరయ్యాయి. ఈ లెక్కన ఆయన అటెండెన్స్ ఏడు శాతం మాత్రమే. ఇక రేఖ కేవలం 18 సార్లు హాజర య్యారు. ఆమె అటెండెన్స్ రేట్ 5 శాతమే. 2017 ఆగస్టు నాటికి సచిన్ 22 అంశాలను లేవనెత్తితే.. ఐదున్నరేండ్ల వ్యవధిలో రేఖ చిరునవ్వులు మినహా ఒక్క ప్రశ్నను లేవనెత్తలేదని రాజ్యసభ రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి.
రాజ్యసభ నిబంధనలేమంటున్నాయి.?
రాజ్యసభ సభ్యుడు ఎవరైనా అనుమతి లేకుండా 60 రోజులపాటు సమావేశాలకు గైర్హాజరైతే.. వారు తమ సభ్యత్వం కోల్పోతారు. కానీ సచిన్, రేఖ మాత్రం రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైనప్పుడు ఒకటో, రెండు రోజులు మాత్రం తప్పనిసరిగా హాజర వుతున్నారు. అందువల్ల వీరిద్దరూ వేటు నుంచి తప్పించుకోగలుగుతున్నారు. ఇలా వారు తమ మెంబర్షిప్ను కాపాడుకోవడంలో సఫలమవు తున్నారు. కానీ వారు ఎంత సెలబ్రిటీలైనప్పటికీ.. ప్రజాసమ స్యల కన్నా తమ సొంత విషయాలకే ఎక్కువ ప్రాధా న్యత ఇస్తున్నట్టు స్పష్టమవుతున్నదని రాజకీయ విశ్లే షకులు అంటున్నారు.
ఇక రేఖ విషయానికొస్తే.. మోడీ పాలనలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అబలలపై జరుగుతున్న దారుణాలు లెక్కలేనన్ని. ఇలాంటి సమస్యలెన్నో ఉన్నా రేఖ ఒక్క అంశంపై కూడా మాట్లాడకపోవడం విచారకర మని మహిళ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఆరునెలల్లో రాజ్యసభ సభ్యత్వం ముగిసేలో పైనా.. రేఖ నోరువిప్పి మహిళల సమస్యలను ప్రస్థా వించాలని పలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి.