Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉమ్మడి ఏపీలో 22 ఏండ్ల వయస్సువారిలో.. ప్రతి ఇద్దరిలో ఒకరు గృహానికే పరిమితం..!
- శ్రామిక శిక్షణ, ఉన్నత విద్యలో 16 శాతం మాత్రమే..!!
- దేశ శ్రామికశక్తిలో 24 శాతం.. ప్రపంచ సగటు 39 శాతం
- దళిత మహిళలు 70 శాతం..!!!
- పెండ్లయినవారిలో 11 శాతం మంది పురుషులు, 22 శాతం మంది మహిళలు
ఆకాశంలో సగం మీరూ..సగం మేమూ అంటాడు మావో సేటుంగ్.. భూమిపై
సగభాగంగా ఉన్న మహిళలకు ఆకాశంలోనూ, అన్ని రంగాలలోనూ సగం వాటా దక్కాల్సిందే.. మహిళల సాధికారత గురించి ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా ఆచరణలో మాత్రం జరిగింది చాలా తక్కువేనని పలు సర్వేల్లో వెల్లడైంది. దేశం మొత్తంమీద..ప్రత్యేకించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉన్నట్టు యంగ్లివ్స్ ఇండియా సర్వే నివేదిక వెల్లడించింది..
న్యూఢిల్లీ: ఉమ్మడిరాష్ట్రం(ఆంధ్రప్రదేశ్)లోని 22 ఏండ్ల మహిళల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇంటికే పరిమితం కాగా, నలుగురిలో ముగ్గురు పురుషులు కార్మికశక్తిలో భాగస్వా ములయ్యారని యంగ్ లివ్స్ ఇండియా సర్వేలో వెల్లడైంది. బాలబాలికల పేదరికంపై బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో యంగ్్ లివ్స్ సర్వే నిర్వహిం చింది. ఉమ్మడి ఏపీలో ఈ సంస్థ 2002లో సర్వే ప్రారంభిం చినప్పటికీ తాజాగా వెల్లడించిన గణాంకాలు 2016లో తీసుకున్నవన్నది గమనార్హం. ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశం మొత్తంమీద సగటున మహిళల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నదని సర్వేలో వెల్లడైంది. ఆరోగ్య రక్షణ, సగటు ఆయు: ప్రమాణం, అక్షరాస్యత, రాజకీయ సాధికారత లాంటి అంశా ల్లో మహిళల పరిస్థితి మరింత క్షీణించడం వల్లే ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల(2017,నవంబర్) ప్రకటించిన ప్రపంచ లింగ వివక్ష సూచీ(జీజీజీఐ)లో భారత్ స్థానం 21 స్థానాలు దిగజారిందని ఫ్యాక్ట్ చెక్కర్ విశ్లేషించింది. జీజీజీఐలో భారత్ స్థానం 2016లో 87గా నమోదు కాగా, 2017లో 108కి పడిపోయింది(స్థానం పెరిగేకొద్దీ పురుషులకూ-మహిళలకూ మధ్య అంతరం పెరిగినట్టు లెక్క)..
దేశంలో 2004 నుంచి 2012 వరకు కోటీ 96 లక్షల మంది మహిళలు శ్రామికశక్తి నుంచి వెనక్కి వెళ్లినట్టు ఇండి యా స్పెండ్ నివేదికలో వెల్లడైంది. ప్రపంచంలో చైనాలోని షాంఘై, బీజింగ్ తర్వాత మూడో పెద్ద నగరానికి సరిపడేం తమంది మహిళలు శ్రామికశక్తి నుంచి విరమించుకున్నట్టు ఇండియా స్పెండ్ పోల్చింది. 2016లో యంగ్లివ్స్ నిర్వ హించిన శాంపిల్ సర్వే ప్రకారం 22 ఏండ్ల వయస్సులోని 459మంది మహిళల్లో 73మంది (16 శాతం) శ్రామిక శిక్షణ లేదా ఉన్నతవిద్యలో నమోదైన్నట్టు తేలింది. అదే పురుషుల్లో చూస్తే 435మందిలో 115మంది(26 శాతం) నమోదయ్యా రు. ఇదే వయస్సువారిలో పురుషుల్లో 11 శాతంమంది, మహిళల్లో 22.56 శాతంమంది పెండ్లిళ్లు చేసుకున్నట్టు తేలింది. సామాజికంగా చూస్తే శ్రామికశక్తిలో దళిత మహి ళలు 70శాతం ఉన్నట్టు వెల్లడైంది. అయితే, శ్రామికశక్తిలో అధిక భాగస్వామ్యం ఉండి కూడా పేదరికంలోనూ దళిత మహిళలే అధికంగా (81 శాతం) ఉండటం గమనార్హం.
ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2016లో భారత శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం 24 శాతం. ఇది ప్రపంచ సగటు 39 శాతంకన్నా చాలా తక్కువ. మహిళా శక్తిని 185 దేశాల్లో చూస్తే బారత్ స్థానం 172. దేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండటానికి కారణం పని ప్రాంతాలు సురక్షితం కాకపోవడమేనని పలు సర్వేల్లో వెల్లడైంది. ప్రధానంగా మహిళలపై లైంగిక వేధింపులు, పని ప్రాంతాల నుంచి ఇండ్లకు తిరిగి వెళ్లే సమయంలో లైంగిక దాడులు ఆందోళనకర స్థాయికి చేరుకోవడం గమనార్హం. మెక్కిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ అంచనా ప్రకారం 2025 కల్లా భారత్కు 25 లక్షల నుంచి 30 లక్షల వరకూ నైపుణ్య శ్రామికులు అవసరమవుతారు. 22 ఏండ్ల వయ స్సువారిలో 2016లో ఉన్నత విద్య లేదా నైపుణ్య శిక్షణలో నమోదైన వారు 24శాతం. వీరిలో మూడింట రెండొంతుల మందికి శిక్షణ అవసరంగా భావిస్తున్నారు. నమోదైనవారిలో శిక్షణ పొందుతున్నవారు పురుషుల్లో 10 శాతం, మహిళల్లో 7 శాతం మాత్రమే. శిక్షణ పొందినవారిలో ఇతర కులాలకు చెందినవారు 11 శాతం, ధనికులు 12 శాతం, పట్టణ ప్రాంతాలకు చెందినవారు 9 శాతం.
2016 శాంపిల్ సర్వే ప్రకారం.. 1882మంది 15 ఏండ్ల వయస్సువారిలో 209మంది (11శాతం) పేద కుటుం బాలకు చెందినవారు. వీరిలో 203(97 శాతం)మంది గ్రామీ ణ ప్రాంతాలవారు. ఎస్టీలు 43.5 శాతంమంది. ఇదే వయ స్సువారిలో పోషకాహార లోపం 2009లో 36 శాతం ఉండ గా, 2016లో 28 శాతానికి తగ్గింది. అయితే, 2016లో పోషకాహార లోపం ఉన్నవారిలో 17 శాతం ఇతర కులాల వారిలో కాగా, 37.5 శాతం ఎస్సీలలో నమోదైంది.