Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిరంగప్రదేశాలు,ఫోన్లో వ్యాఖ్యలు చేసినా శిక్ష: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలను బహిరంగ ప్రదేశంలో కించపరిచే విధంగా ఫోన్లో వ్యాఖ్యలు చేసిన వారిపై గరిష్టంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించనున్నట్టు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన మహిళను ఫోన్లో కులం పేరుతో వ్యక్తి దూషించాడని వేసిన దావాపై కోర్టు ఈ విధంగా స్పందించింది. ఈ ఏడాది ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి చేసిన అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఎలాంటి జోక్యం చేసుకోమని జస్టిస్ చలమేశ్వర్, ఎస్. అబ్దుల్ నజీర్తో కూడిన ధర్మాసనం తెలిపింది. అతను బహిరంగ
ప్రదేశంలో ఫోన్లో మాట్లాడనట్టు నిర్థిష్టమైన సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. ఈ సంభాషణల సమయంలో మహిళ, వ్యక్తి వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నారని, ఇది వారివురికే తెలుస్తుందని, ఇది ప్రజల దృష్టిలో ఉండదని, కాబట్టి కేసును కొట్టివేయాలని వ్యక్తి తరఫు న్యాయవాది వివేక్ అన్నారు. భూ సంబంధిత లావాదేవీలపై వారి మధ్య బెదిరింపులు, మోసపూరిత సంభాషణలు జరిగినట్టు మహిళ అస్పష్టమైన ఆరోపణలు చేశారని తెలిపారు. కాని వ్యక్తి బహిరంగ ప్రదేశంలో మాట్లాడలేదని నిరూపించుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. ఆగస్టు 17న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలనే వ్యక్తి వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించింది.