Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్యలు చెప్పండి: హోంశాఖకు సుప్రీం ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
దేశంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకున్న చర్యలేమిటో తెలియ చేయాలని కేంద్ర హోంశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణ డ్రగ్స్ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తోందంటూ దాఖలైన పిటిషన్ సోమవారం జస్టిస్ దీపక్మిశ్రా నేతృత్వంలోని ప్రధాన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భం గా గత ఆదేశాలకనుగుణంగా కేంద్ర మానవవనరుల శాఖ దాఖలు చేసిన అఫిడవిట్పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే కేంద్ర నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోహోంశాఖ పరిధిలోకి వస్తుందని కేంద్ర న్యాయవాది బాల సుబ్రమణ్యం కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో హోంశాఖను ప్రతివాదిగా చేర్చింది. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై తగిన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. కేసు విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.