Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుంటూరు జిల్లా మహాసభలో ఎంఎ.గఫూర్
గుంటూరు:సామాజిక మార్పులో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తు న్నారని, ఇతర ఉద్యమాలనూ తయారు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ.గఫూర్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం కె.నాగమల్లేశ్వరరావు అధ్యక్షత నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా మహాసభలో ఆయన సౌహార్ధ సందేశం ఇచ్చారు. ఉపాధ్యాయులకు సమిష్టి భావన, లక్ష్యం ఉండాలని చెప్పారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై నిత్యం అధ్యయనం చేస్తూ పోరాడాలని తెలిపారు. సీపీఎస్ రద్దు ఉద్యమంలో యూటీఎఫ్ కీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. బీజేపీకి అనుబంధ కార్మిక సంఘాలూ ఐక్య ఉద్యమాల్లో పాల్గొని కార్మికుల్లో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్న గఫూర్ ఉపాధ్యాయుల్లో వర్క్ ఔట్సోర్సింగ్ విధానం వస్తోందని పేర్కొన్నారు. సీిఎం చంద్రబాబు విదేశీ కంపెనీలకు బ్రోకర్గా పనిచేస్తున్నారని, ఉపాధ్యాయ, కార్మిక సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మెన్ ఎన్.తాండవకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు, ఐక్య ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు ఎన్.కుమార్రాజా, రాష్ట్ర యూటీఎఫ్ సహాధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.హనుమంతరావు పాల్గొన్నారు.