Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూరిపోసేది ముస్లిం విద్వేషం
- రాజస్థాన్లో హిందూ సదస్సుల్లో లవ్ జిహాదీ, రామ మందిర నిర్మాణంపై ప్రసంగాలు
- హిందూ ఓటు బ్యాంక్ను బీజేపీ వైపు తిప్పే ప్రసంగాలు
- ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి తోడ్పడినవి
- 'హిందూ సదస్సు'లు. హిందువుల్లో ముస్లిం విద్వేషాన్ని రగల్చటమే
ఈ సదస్సుల ప్రధాన ఎజెండా. ఆర్ఎస్ఎస్, భజరంగ్దళ్, వీహెచ్పీ.. వీటి అనుబంధ సంస్థల నాయకులు వచ్చి ప్రసంగిస్తారు. తమ మాటలతో, కరపత్రాలతో, బ్రోచర్స్తో హిందూ ఓటు బ్యాంక్ను బీజేపీ వైపునకు తిప్పటమే వీరి లక్ష్యం. హిందూ ఆధ్మాత్మికత, సాంప్రదాయ జీవన శైలి పేరుతో సదస్సు ప్రారంభమవుతుంది. కానీ ఎజెండా అంతా రాజకీయమే. ఇది ఇప్పుడు రాజస్థాన్లో బలంగా ముందుకెళుతోంది. లవ్ జిహాద్, గో రక్షణ, రామ మందిర నిర్మాణం తదితర అంశాలతో హిందువుల్ని ప్రభావితం చేసే పని 'జైపూర్ హిందూ సదస్సు'లో పక్కాగా అమలుజేశారు.
జైపూర్ : రాజస్థాన్లో 'హిందూసదస్సు'ల ముసుగులో జరుగుతున్న తతంగం బట్టబయ లైంది. ఆధ్యాత్మికత, సాంప్రదాయ విలువల్ని బోధించే సదస్సులుగా కరపత్రాల్ని పంచటం, తీరా సదస్సుకు వచ్చినవారికి ముస్లింల పట్ల విద్వేష భావజాలాన్ని కలిగించటం చేస్తున్నా యి. మతం పేరుతో ఇవి ఏర్పాటుచేస్తున్న సద స్సులకు స్పష్టమైన రాజకీయ ఎజెండా ఉందన్న విషయం తేలింది. ఆర్ఎస్ఎస్తో తమకు ఎలాంటి సంబంధాలూ లేవని సదస్సు నిర్వాహ కులు (హెచ్ఎస్ఎస్ఎఫ్) చెప్పుకుంటున్న దాం ట్లో ఇసుమంతైనా నిజం లేదు. సదస్సు ప్రారం భమయ్యాక, అక్కడికి భజరంగ్దళ్, ఆర్ఎస్ ఎస్, వీహెచ్పీ..మొదలైన కాషాయ మూకలు కరపత్రాల్ని పంచుతున్నారు. 'హిందూ సదస్సు' వేదికలను వారు ముస్లిం విద్వేష భావజాలాన్ని వెదజల్లడానికి వాడుకుంటున్నారు.
హిందూ మత ఆధ్యాత్మికత, సాంప్రదాయా లతో ఆధునిక మనిషి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుం బ విలువలు, మహిళలకు గౌరవం, పోరాట పటిమ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్యం తదితర అంశాల్లో సగటు పౌరుడికి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం మన ఆధ్మాత్మిక అంశాల్లో ఉంది... అంటూ, జైపూర్ నగరంలో 'హిందూ స్పిర్చువల్ అండ్ సర్వీస్ ఫౌండేషన్' (హెచ్ఎస్ఎస్ఎఫ్) సంస్థ ఐదు రోజుల 'హిందూ ఫెయిర్'ను నిర్వహించింది. పెద్ద ఎత్తున మహిళల్ని, యువతను ఆకర్షిం చింది. ఈ సదస్సుకు పాఠశాల విద్యార్థుల్ని తప్పక పంపాలని రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో లక్షల సంఖ్యలో పాఠశాల విద్యార్థుల్ని బలవంతంగా ఈ సదస్సులకు తరలించారు. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న 'హెచ్ఎస్ఎస్ ఎఫ్' సంస్థ తనను తాను స్వతంత్ర ఆర్గనైజేషన్గా చెప్పుకుం టోంది. కానీ అది నిజం కాదు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ 'రాష్ట్రీయ సేవా భారతి'తో హెచ్ఎస్ఎస్ఎఫ్కు సంబంధాలున్నా యి. ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన నాయకులే ఈ సంస్థను నడుపుతున్నారు. దేశవ్యాప్తంగా పలు నగరల్లో 'హిందూ ఫెయిర్' నిర్వహించటం దీని పని. హిందూ ఆధ్మాత్మికత, జీవన శైలి గురించి చెబుతారని ఈ సదస్సుకు వచ్చేవారిలో ముస్లింల పట్ల విద్వేషాన్ని నూరిపోస్తున్నారు. లవ్ జిహాదీతో హిందూ యువతుల్ని తమ మతంలోకి మారుస్తున్నారని, వారు తీవ్రవాదు లని పేర్కొంటూ ప్రసంగాలు చేస్తున్నారు.
జాతీయ అతివాదం, లవ్ జిహాద్, గో రక్షణ, శాఖాహారం తీసుకోవటం, రామమందిర నిర్మాణం తదితర అంశాలు బోధిస్తున్నారు. అన్ని అంశాల్లో ముస్లింలను తీవ్రవాదులుగా, హిందూ మహిళల్ని ఎత్తుకెళ్లేవారిగా తీవ్ర విద్వేష బీజాల్ని పసి హృదయాల్లో నాటుతున్నా రు. బాలీవుడ్ నటి కరీనాకపూర్ (సైఫ్ అలీ ఖాన్ను వివాహమాడింది) ఫొటోలతో కూడిన కరపత్రాల్ని భజరంగ్ దళ కార్యకర్తలు జైపూర్ సదస్సులో పంచారు. స్నేహం పేరుతో హిం దూ యువతుల్ని ముస్లిం యువకులు బుట్టలో వేసుకుంటున్నారని, కాబట్టి మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి...అంటూ సదస్సుకు వచ్చిన తల్లిదండ్రులకు చెబుతున్నారు. ముస్లిం యువ కుడితో ప్రేమలో పడితే, అతడు దుర్మార్గుడు, తీవ్రవాది, పాకిస్తాన్ మద్దతుదారు అంటూ మీ అమ్మాయికి చెప్పి మార్చండంటూ..ఉద్భోదలు చేస్తున్నారు.
- ఆవుల్ని చంపినవారికి మరణశిక్ష విధించాలని 'భారతీయ గో క్రాంతి మంచ్' నాయకులు డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ తెచ్చిన గోవధ నిషేధం...కాగితాలకే పరిమితమైందని, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆ సంఘం నాయకుడు డిమాండ్ చేశాడు.
- గోవధపై నిషేధాన్ని ప్రకటించలేదని కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీల్ని దూషిస్తూ భజ్రంగ్దళ్ కరపత్రాల్ని పంచింది.
- 'మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు శాఖాహారులుగా మారండి' అంటూ అక్కడికి వచ్చిన తల్లిదండ్రులకు బాబా జై గురు దేవ్ (ఉజ్జయినీ) ఉపదేశం చేశారు. వచ్చిన వారితో శాఖాహారులుగా మారుతున్నామని ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు.
- రామ మందిర నిర్మాణంపై వీహెచ్పీ బ్రోచర్స్ను పంపిణీ చేసింది.
ఇలాంటి సదస్సుల్ని వెంటనే నిలిపివేయాలి : సీపీఐ(ఎం)
మత విద్వేషాన్ని కలిగించే 'హిందూ సదస్సు'లకు అనుమతివ్వటాన్ని తీవ్రంగా ఖండి స్తున్నామని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సోమ వారం ఒక ప్రకటన జారీ చేసింది. అలాంటి సదస్సులకు పాఠశాల పిల్లల్ని పంపించాలని రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలివ్వటాన్ని సీపీఐ(ఎం) తప్పుబట్టింది. ఇది భారత రాజ్యాంగ విలువల్ని, సెక్యూలర్ లక్షణాల్ని తీవ్రంగా దెబ్బకొట్టడమేనని పొలిట్బ్యూరో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు జారీ చేయటం ఎంత మాత్ర మూ ఆమోదయోగ్యం కాదని, మైనార్టీ వర్గాల పై విద్వేషాన్ని రగిలించే ఇలాంటి 'హిందూ సదస్సు'లను వెంటనే నిలిపివేయాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.