Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎపిఆర్పిఎ రాష్ట్ర గౌరవాధ్యక్షులు అజరుకుమార్
అమరావతి : ఉద్యోగులకు పెన్షన్ రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్(ఎపిఆర్పిఎ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.అజరు కుమార్ అన్నారు. పెన్షనర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎపిఆర్పిఎ ఆధ్వర్యంలో విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం టి.ప్రభుదాస్ అధ్యక్షతన నిర్వహిం చిన సభలో ఆయన మాట్లాడారు. ఇపిఎస్-95 పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం నిర్బంధంగా అమలుచేస్తోందన్నారు. పెన్షన్ చట్టంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు ఉద్యోగులు, కార్మికులు రిటైరైన తర్వాత భద్రత కల్పించే పెన్షన్ పథకానికి ప్రభుత్వం తూట్లుపొడుస్తోందన్నారు.పెన్షన్ కేటాయింపులకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మాత్రం రాయితీలిస్తోందని విమర్శిం చారు. ఇపిఎస్, సిపిఎస్ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ, కార్మిక సంఘా లన్నీ ఐక్యంగా పోరాడాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కె లక్ష్మణరావు మాట్లాడు తూ రిటైరైన ఉద్యోగులందరికీ పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారి సేవలకు ప్రతిఫలంగా పెన్షన్ ఇవ్వాల్సిన ప్రభుత్వం వివిధ జీఓలతో ఉద్యోగుల హక్కుల్ని కాలరాస్తోందన్నారు.