Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ విద్యావేత్త సుగతా మిత్రా
విశాఖపట్నం: ఇంటర్నెట్ వల్ల మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయని ప్రముఖ విద్యావేత్త సుగతామిత్రా అభిప్రాయపడ్డారు. ఎడ్యుటెక్ సదస్సులో రెండవ రోజు 'ప్రాపం చిక విద్య ఉపయో గాలు, నష్టాలు'పై చర్చించారు. ఈ సందర్భంగా సుగతామిత్రా మాట్లాడుతూ.. అసంకల్పితంగా, పరిసరాల ద్వారా నేర్చుకునే జ్ఞానం, విద్య దీర్ఘకాలం ఉంటుందని తెలిపారు. గురువు లేకుండా సాంకేతిక విద్యను అభ్యసించి నట్లయితే తప్పుతోవకు అవకాశం ఎక్కువగా వుంటుందన్నారు. బాలలకు స్వయంగా చూసి నేర్చుకునే బుద్ధి.. పుట్టినప్పటి నుంచి ఉంటుందన్నారు. విద్యను నేర్పే క్రమంలో బాలలు గ్రహించే రీతిలో తెలియజేయాలన్నారు. మూసగా, యాంత్రి కంగా నేర్చుకోవడం మూలంగా మూసపని మాత్రమే అబ్బుతుందని తెలిపారు. సాంకేతిక విద్యకు పర్యవేక్షణ లేనట్లయితే ఏ విధంగా దుర్వినియోగమవుతుందో వీడియో క్లిప్స్తో చూపించారు.