Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు కార్పొరేషన్లూ అధికార పార్టీవే..
- బీజేపీ-ఎస్ఏడీ కూటమికి భంగపాటు
- ఒక్క వార్డూ గెలుచుకోని ఆప్
చంఢగీఢ్: పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ -శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ)కు ఘోర ఓటమి తప్పలేదు. పంజాబ్లోని మూడు మున్సిపల్ కార్పొ రేషన్లు(జలంధర్, పటియాలా, అమృత్సర్), 32 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీలకు ఆది వారం పోలింగ్ జరిగింది. పటియాలాలో 62.22 శాతం, జలంధర్లో 57.2 శాతం, అమృత్సర్లో 51 శాతం పోలింగ్ నమోదైంది. కాగా.. ఈ ఎన్నికల్లో మూడు కార్పొరేషన్ స్థానాలనూ కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. జలంధర్లో మొత్తం 80వార్డుల్లో కాం గ్రెస్ 66స్థానాలను గెలుచుకున్నది. బీజేపీ-ఎస్ఏడీ కూటమి 12, స్వతంత్రులు 2 వార్డులను గెలుచుకున్నారు. పటియాలా కార్పొరేషన్లో 60 వార్డుల్లో 58 సీట్లలో అధికార పార్టీనే విజయం సాధించింది. అటు అమృత్సర్లోనూ కాంగ్రెస్ హవానే కొనసాగింది. 85 వార్డులకు గాను ఆ పార్టీ 63 స్థానాలను గెలుచుకున్నది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్).. తన ఉనికిని చాటుకోలేకపోయింది. ఆ పార్టీ ఒక్క వార్డులోనూ గెలువకపోవడం గమనార్హం. దాంతోపాటు 32 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర పంచాయతీల్లో కాంగ్రెస్ 29 చోట్ల విజయం సాధించింది.
ఎన్ఏడీ ఒక సీటు గెలుచుకోగా.. మిగిలిన రెండు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. మరోవైపు రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఏడాదిలోపే ఇంతటి విజయం సాధించడంతో పార్టీ వర్గాలు ఆనందంలో మునిగిపోయాయి. కాంగ్రెస్కు భారీ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు పంజాబ్ ముఖ్య మంత్రి అమరీందర్ సింగ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అకాలీదళ్ తన పదేండ్ల పాలనలో ఏం చేసిందో ప్రజలు మర్చిపోలేదని ఆయన ఈ సంద ర్భంగా చెప్పారు. పంజాబ్లో ఈ యేడాది మార్చిలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే.