Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ : ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలో ఎంఏ.గపూర్ పిలుపు
కర్నూలు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులర్ ఉద్యోగ నియామకాలకు మంగళం పాడి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పార్ట్టైమ్ తదితర పేర్లతో ఆధునిక బానిస వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ. గపూర్ పేర్కొన్నారు. బానిస వ్యవస్థ, వెట్టిచాకిరీలను నిషేధించినట్లు చట్టాలు వచ్చినా ప్రభుత్వాలే వెట్టిచాకిరీ చేయిస్తున్నాయన్నారు. దీని విముక్తి కోసం కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యమ బలాన్ని చాటాలని పిలుపునిచ్చారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాకు,్ట అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర 4వ మహా సభలు కర్నూలులో ఆదివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులతో మహాసభల ప్రారంభం సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా పరిషత్ నుంచి మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జేఎసీ చైర్మన్ ఎవి నాగేశ్వరరావు ఆధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఎంఏ.గపూర్ మాట్లా డారు. ప్రభుత్వాలు తక్కువ వేతనంతో పని చేయించుకు నేందుకు రెగ్యులర్ ఉద్యోగ నియమాకాలకు బదులు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పేరుతో పని చేయించుకుం టోందని గఫూర్ అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వాలు మొండిగా వ్యహరిస్తున్నాయన్నారు. ఎన్జీఓల సంఘం కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల ను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే ఎన్జీఓ లకు సీపీిఎస్ విధానాన్ని అమలు చేస్తోందని భవిష్యత్తులో ఎన్జీఓలు ఇలాంటి వారిని కూడా కలుపుకొని ఉద్యమాలు చేస్తేనే వారికి మనుగడ ఉంటుందని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షలు మంది ఉన్న కాంట్రాక్టు అవుట్సోర్సింగు ఉద్యోగులు సంఘటిత పోరాటాలు చేస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయని తెలిపారు. ఈ పోరాటానికి సీఐటీయూ వెన్నంటే ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేెఏసీ జనరల్ సెక్రటరీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 20ఏళ్ల నుంచి ఉద్యోగు లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు ఏదొక కారణం చూపి వెట్టిచాకిరీ చేయిస్తోందన్నారు. పంజాబ్, జమ్మూకాశ్మీర్లలో చివరకు తెలంగాణలో కూడా రెగ్యులర్ చేసినా ఎపిలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నిం చారు. ఉద్యోగులు విడివిడిగా ఉంటే చిన్న సంఖ్యగా కనిపి స్తారని కలిసి ముందుకెళ్లాలన్నారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీ వై. శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని అధికారంలోకి రాగానే సాకులు చెబుతున్నారని విమర్శిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారన్నారు. మహాసభల స్ఫూర్తితో చేసే పోరాటాలకు శాసనమండలిలో, బయట పిడిఎఫ్ సంపూర్ణ మద్దతునిస్తుందని తెలిపారు. ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎన్.జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ దేశంలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లేని రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే అవి వామపక్షాలు పాలిస్తున్న త్రిపుర, కేరళ మాత్రమేనన్నారు. తొలినాళ్లలో ప్రభుత్వ శాఖల్లో టెంపరరీ, కంటింజెంట్ ఉద్యోగులుండేవారని, ఐదేళ్లు సర్వీసు పూర్తయ్యేలోపు రెగ్యులర్ చేసే వ్యవస్థ ఉండేదన్నారు. సరళీకృత విధానాలు దేశంలోకి వచ్చాక దుర్మార్గమైన పద్ధతిలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పేరుతో వెట్టిచాకిరీ చేయించుకునే పద్ధతి వచ్చిందన్నారు. మహసభ లలో సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్యక్షులు ఎం.బాలకాశి, నేషనల్ హెల్త్మిషన్ కాంట్రాక్టు ఉద్యోగుల ఫెడరేషన్ ఆధ్యక్షులు ఎ.మాధవి, ఎపిస్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా చైర్మన్ ఎ.నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాసులు, యుటి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.సురేశ్కుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ఎస్ రాధాకృష్ణ పాల్గొన్నారు.
మహిళల శ్రమను దోచుకుంటున్నారు
పాలకులు, ప్రయివేటు యాజమాన్యాలు మహిళల శ్రమను దోచుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ కె.ధనలక్ష్మి అన్నారు. ఎపి కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు ఉద్యోగుల నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా మహిళా ఉద్యోగుల రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం కర్నూలు లో నిర్వహించారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగు విధా నంలో మహిళలకు సమాన వేతనం, గౌరవం లేదన్నారు. ఉద్యోగుల హక్కులు సాధించుకోవా లంటే అందరం కలిసి ఐక్యంగా పోరాడాలని, లేకుంటే ఏమీ సాధించలేమని ఆమె అన్నారు. పురుషులతో సమానంగా పనిచేసే శక్తి మహిళలకు ఉందన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఐక్యంగా పోరాడి ముఖ్యమంత్రి మెడలు వంచి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల మాట్లాడుతూ కష్టాలతో కుంగిపోయేదానికన్నా పోరాడి గెలవాలని పిలుపునిచ్చారు. అవుట్ సోర్సింగ్ రాష్ట్ర కార్యదర్శి బి.సంధ్యారాణి, కెవిఆర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ ఎం.ఆశీర్వాదమ్మ, జిల్లా కార్యదర్శి ఆర్.పుష్పవతి పాల్గొన్నారు.