Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో స్కూళ్లకు హిందూ జాగరణ్ మంచ్ హెచ్చరిక
లక్నో: మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు హిందూత్వ సంస్థల బెదిరింపులు ఎక్కువయ్యాయి. దేశంలోని ప్రజలు ఏం తినాలో.. ఎలా ఉండాల్లో.. ఎలాంటి దుస్తులు ధరించాలో వారే నిర్ణయిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని స్కూళ్లలో క్రిస్మస్ వేడుకలు జరపకూడదని హిందూ యువ వాహిని అనుబంధ సంస్థ హిందూ జాగరణ్ మంచ్(హెచ్జేఎం) హెచ్చరిక జారీ చేయడం వివాదాస్పదమవుతున్నది. హిందూ యువ వాహినిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించారు. అంతేకాదు.. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. క్రిస్టియన్ స్కూళ్లలో ఎక్కువ మంది హిందూ విద్యార్థులు ఉన్నారని హెచ్జేఎం అధ్యక్షుడు సోనూ సవిత తెలిపారు.
కాగా.. కిస్మస్ జరుపుకునేందుకు విద్యార్థులను బొమ్మలు, కానుకలు తీసుకురమ్మంటున్నారని చెప్పారు. గిఫ్టులు, ఇతర వస్తువులతో హిందూ విద్యార్థులను క్రైస్తవులు ఆకర్షిస్తున్నారని, తర్వాత మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను ఖండించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి కోరుతామని సవిత వెల్లడించారు.