Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గంలో రూ.100 కోట్లు పంచిన అన్నాడీఎంకే : ఈసీకి డీఎంకే నేత స్టాలిన్ ఫిర్యాదు
చెన్నై: ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారన్న కారణంతో కిందటిసారి రద్దయిన ఆర్కేనగర్ ఉప ఎన్నిక.. మరోసారి అలాంటి పరిస్థితినే ఎదుర్కోబోతుందా?.. నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే.. ఆర్కేనగర్ ఉపఎన్నిక కోసం అధికార పార్టీ అన్నాడీఎంకే ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేసిందని డీఎంకే నేత ఎంకె స్టాలిన్.. ఎన్నికల కమిషన్(ఈసీ)కు ఫిర్యాదు చేయడం చర్చాంశనీయంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ స్థానానికి ఈనెల 21న ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం రూ.25 లక్షల నగదును ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. కాగా.. ఓటర్లకు అన్నాడీఎంకే పార్టీ రూ.100కోట్లు పం చి పెట్టిందని స్టాలిన్ ఆరోపించారు. ఒక్కో ఓటరుకు రూ.6 వేలు ఇచ్చారని అన్నారు. ఈఎన్నికలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న మధుసూధనన్పై కఠినచర్యలు తీసుకోవాలని ఈసీకి రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. వాస్తవానికి ఆర్కేనగర్ ఉపఎన్నిక ఈ యేడాది ఏప్రిల్ 12నే జరగాల్సి ఉన్నది. కానీ, నియోజకవర్గంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నదని తేలడంతో ఎన్నికను ఈసీ రద్దు చేసింది. గల్లంతైన జవాను మృతదేహం లభ్యంశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో భారీ హిమపాతం కారణంగా గల్లంతైన జవాను శవమై కనిపించాడు. అతడి మృతదేహాన్ని రెస్క్యూ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. కుప్వారా జిల్లా నౌగామ్, బండిపోరా జిల్లా బట్కూర్ ప్రాంతాల్లో గత సోమవారం మంచు చరియలు విరిగి పడిన ఘటనల్లో ఐదుగురు జవాన్లు గల్లంతైన సంగతి తెలిసిందే. వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా.. నౌగామ్ లో జవాను కౌశల్సింగ్ మృతదేహం లభ్యమైనట్టు సైనికాధికారి ఒకరు వెల్లడించారు. మిగిలిన నలుగురు జవాన్ల జాడ ఇంకా తెలియరాలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.