Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్ధవ్ థాకరే
ముంబయి: గుజరాత్లో బీజేపీ స్పష్టమైన విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ థాకరే విబేధించారు. గుజరాత్లో నెలకొన్న వాస్తవ రాజకీయ పరిస్థితికి, ఎగ్జిట్ పోల్ ఫలితాలకు మధ్య చాలా తేడా ఉన్నదన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీకి స్పష్టమైన విజయాన్ని సూచించాయని, ఆ ఫలితాలు తమకు ఆమోద యోగ్యంగా లేవని, సోమవారం నాడు వెలువడే తుది ఫలితాలనే ఆమోదిస్తామని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీని ఈ సందర్భంగా అభినందించారు. గుజరాత్ ఎన్నికల కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారని, ఆయన తన పార్టీ కార్యకర్తల ఆకాంక్షలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్టు థాకరే తెలిపారు