Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పటీదార్లు ఆదివాసీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అక్రమాలు: హార్దిక్ పటేల్
అహ్మదాబాద్: గుజరాత్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) ట్యాంపరింగ్ కోసం 140మంది ఇంజినీర్లను బీజేపీ అద్దెకు తీసుకున్నదని పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్్పటేల్ అన్నారు. నా మాటలు కొందరికి నవ్వు తెప్పించినా బాధలేదు. దేవుడు సృష్టించిన శరీరాన్నే మార్చగలిగినపుడు మనిషి సృష్టించిన యంత్రాన్ని మార్చ లేరా..? అంటూ హార్దిక్పటేల్ తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించా రు. గుజరాత్ ఎన్నికల్లో ఉపయోగించిన 4000 ఈవీఎం లను హ్యాక్ చేయించడానికి అహ్మదాబాద్కు చెందిన ఓ కంపెనీ నుంచి 140మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లను అద్దెకు తీసుకున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. ఏటీఎంలను హ్యాక్ చేయడం వాస్తవమే అయినపుడు ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ఎందుకు సాధ్యం కాదని హార్దిక్పటేల్ ప్రశ్నించారు. పటీదార్లు, ఆదివాసీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈవీఎంల హ్యా కింగ్్ ఎక్కువగా జరిగినట్టు హార్దిక్పటేల్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ వర్గాలు ఇటీవల బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్పిన విషయం తెలిసిందే.