Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చకు రానున్న కీలక ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: పార్లమెంటు ాల సమావేశాల్లో పలు కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్(కాగ్) నివేదికలు చర్చకు రాను న్నట్లు సమాచారం. గంగా జలాల ప్రక్షాళన ప్రాజెక్టు 'నమా మి గంగే', రైళ్లలో బయో టారులెట్స్ ఏర్పాటు, కుడంకుళం అణు విద్యుత్తు ప్రాజెక్టులపై నివేదికలతో పాటు కేంద్ర ఆర్థిక శాఖపై రూపొందించిన నివేదికల్ని పార్లమెంటుకు కాగ్ త్వరలో సమర్పించనున్నట్టు అధికారులు తెలిపారు.
గంగా జలాల ప్రక్షాళన ప్రాజెక్టు
పరిశుద్ధ గంగా జాతీయ మిషన్(ఎన్ఎమ్సీజీ) కింద గంగా జలాలను ప్రక్షాళించేందుకు కేంద్రం రూ. 20 వేల కోట్లను కేటాయించింది. వాటిలో రూ. 17వేల కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. మురుగు నీటి నిర్వహణ, వ్యర్థాల నిర్వహణ, జీవవైవిధ్యం పరిరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, అడవుల పెంప కం, గ్రామీణ పారిశుధ్యం మొదలగు ప్రాజెక్టులకు ఈ నిధుల్ని కేటాయించింది. అయితే ఈనిధుల వినియో గంలో పారదర్శకత, సాధించిన విజయాలు, వాటి గణాంకాలను తాజా నివేదికలో కాగ్ పేర్కొననుంది.
రైల్వేలో బయో టారులెట్స్ ప్రాజెక్టు
రైలు బోగీల్లో బయోటారులెట్స్ ఏర్పాటు ప్రాజెక్టుపై కాగ్ రూపొందించిన నివేదిక వచ్చేవారంలో పార్లమెంట్లోకి రానుంది. ఇది వాటి పనితీరుకు సంబంధించిన నివేదిక అని, ప్రస్తుతానికి వాటి వినియోగం ఏ స్థాయిలో ఉందన్న అంశంతో పాటు, మరిన్ని సిఫార్సులను పేర్కొన్నామని ఈ నివేదిక రూపకల్పనలో భాగస్వాములైన ఓ అధికారి చెప్పారు. 2019 నాటికి అన్ని బోగీల్లోనూ బయో టారులెట్స్ను ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని రైల్వే శాఖ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కుడంకుళం అణువిద్యుత్తు ప్రాజెక్టు తొలి రెండు యూనిట్ల పనితీరు, మలి రెండు యూనిట్ల నిర్మాణం వంటి అంశాలపై కాగ్ నివేదిక రూపొందించింది. ఇది కూడా చర్చకు రానుంది.