Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుంతియా సమక్షంలో చేరిక
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
వైసీపీ నేత రాజ్ఠాకూర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సోమవారం ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ సమక్షంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా పార్టీ కండువా కప్పి స్వాగతించారు. గతంలో శాప్ అధ్యక్షుడిగా పని చేసిన రాజ్ఠాకూర్ వైఎస్ఆర్ మరణం తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి చేరారు. అయితే రాహుల్గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత మళ్లీ కాంగ్రెస్లో చేరారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయకులు కాంగ్రెస్లోకి చేరుతారని కుంతియా తెలిపారు. కాగా రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని రాజ్ఠాకూర్ చెప్పారు.