Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాశ్మీర్లో సైన్యం దుశ్చర్య
శ్రీనగర్: 23 ఏండ్ల యువకుడ్ని సొంత ఇంటి ముందే సైన్యం కాల్చి చంపిన దారుణం జమ్మూ కాశ్మీర్లో జరిగింది. నిర్ధయగా యువ కుడ్ని కాల్చి చంపిన సైన్యం అతడు ఎదురుకాల్పుల్లో చనిపోయాడని బుకాయిస్తోంది. మృతుడి తండ్రి, బంధువులు మాత్రం సైన్యమే హత్య చేసిందని చెబుతున్నారు. ఈ ఘటనపై మేజిస్టేరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కుప్వారాలోని టిండిపోరా గ్రామంలో ఆసిఫ్ ఇక్బాల్ టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. శనివారం అతని ఇరుగుపొ రుగు వ్యక్తి ఒకరు ఫోన్ చేసి తనకు ప్రజారవాణా అందుబాటులో లేదని, టాక్సీ కావాలని కోరాడు. దీనికి ముందుగా ఆసిఫ్ రాలేనని చెప్పాడు. అయితే ఆసిఫ్ తండ్రి చెప్పడంతో అక్కడికి బయలుదేరాడు. బయటికి వెళ్లిన మరుక్షణమే అతను మృత్యువాత పడ్డాడు. సైన్యం అతన్ని కాల్చిచంపింది. తుపాకీ మోత శబ్దం విన్న తండ్రి వచ్చి చూసేసరికే ఆసిఫ్ రక్తపు మడుగులో వున్నాడు.