Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పటియాలా: పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పటియాలా, అమృతసర్, జలంధర్తోపాటు 29 మున్సిపల్ కౌన్సిల్స్, నగర పంచాయితీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన 29 మున్సిపల్ కౌన్సిల్స్కుగాను 20 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ విధానాలకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని గెలుపుపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. విద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షానికి మున్సిపల్ ఎన్నికల తీర్పు చెంపపెట్టు అని అన్నారు. జలంధర్ మున్సిపల్ కార్పొరేషన్లో 80 స్థానాలకు గాను 66 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, బీజేపీ, అకాళీదళ్ల కూటమి 12 స్థానాల్లో గెలుపొందింది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. పటియాలాలో 60 సీట్లకు గాను 59 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. అమతసర్లో సైతం కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 85 స్థానాల్లో 63 స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.