Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమతో చేతులు కలిపి వుంటే ఫలితాలు భిన్నమైన రీతిలో వెలువడి వుండేవని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీతో జత కట్టి వుంటే అది ఫలప్రదంగా వుండే దని, పరిస్థితులన్నీ మారిపోయేవని ఆయన సోమవారం ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న బలహీనతే కాంగ్రెస్ ఓటమికి దారి తీసిందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా కొనసాగుతూ వేళ్లూనుకుపోయిందని, కాంగ్రెస్కు గ్రామీణ పునాది లేకపోవటంతో ప్రయోజనం కన్పించలేదని అన్నారు.