Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ ఎన్నికల ఫలితాలపై సీతారాం ఏచూరి
కొల్కతా: గుజరాత్ ఎన్నికల ఫలితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విధానపరమైన విపత్తు అని సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్లోని అసాన్సోల్లో ఆయన మాట్లా డారు. మోడీ ప్రదర్శించిన గుజరాత్ అభివృద్ధి నాటకానికి తెరపడిందన్నారు. ప్రధాని మోడీకి, ఆయన పార్టీకి ఈ ఫలితాలు కచ్చితంగా పరాభవమేనని ఏచూరి అన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో బిజెపికి లభించిన ఓట్ల శాతంతో పోలీస్తే ఈ సారి 10 శాతం తగ్గాయని, 2012 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినా చాలా స్థానాలను బీజేపీ ఈ దఫా కోల్పోయిందని ఏచూరి తెలిపారు. జిఎస్టిపై ప్రజల అసంతృప్తి ప్రజాతీర్పులో ప్రతిబింబించిందని, నాయకులను తయారు చేయడం లోనూ, ప్రజాతీర్పును విజయంగా మల్చుకోవడంలో నూ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని చెప్పారు. దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ విధానాలని, ప్రత్యామ్నాయ నాయకులు కాదని ఏచూరి చెప్పారు. విస్తారమైన మత సమీకరణల ద్వారా, ఎన్నికలకు ఒక రోజు ముందు ముస్లిం యువకుడ్ని హత్య చేయడం వంటి రాజస్థాన్ తరహాలో ఘటనలతోనే గుజరాత్లో బిజెపి విజయం సాధించగలిగిందని ఏచూరి అన్నారు. అన్నికంటే మించి బూర్జువా మీడియా చిత్రీకరించినట్లుగా మోడీకి, రాహుల్కు మధ్య జరగలేదన్నది స్పష్టమైందన్నారు. ప్రత్యామ్నాయ విధానాలు అవసరమన్న విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. మోడీ ప్రోత్సహిస్తున్న మతత్వ ఆగడాలను ఓడించగలిగేది ప్రత్యామ్నాయ విధానా లేనని ఏచూరి స్పష్టం చేశారు. హిమాచల్ప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేకత అంశం బాగా పనిచేసిందని ఏచూరి అన్నారు. భారీస్థాయిలో మత సమీకరణలకు పాల్పడటం, ప్రత్యామ్నాయ విధానాల లేమి ఫలితంగా బీజేపీ విజయం సాధించగలిగిందని అన్నారు.