Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీని హెచ్చరించిన సీపీఐ నేత డి రాజా
న్యూఢిల్లీ : ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల దీర్ఘకాలంలో దుష్పరి ణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తూ ఈ ప్రతిపాదనలపై చర్చ జరపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీపీఐ నేత డి.రాజా మంగళవారం లేఖ రాశారు. వేగవంతమైన ఆర్థిక విధానాల వల్ల దేశం ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటున్నదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. గంభీరమైన ఆర్థిక విధానాలు, ఇతర దురదృష్టకరమైన ఆలోచనల దుష్పరిణామాలను ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉప సంహరణ ప్రతిపాదనపై పూర్తిగా చర్చించడమే కాకుండా, ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవాలని అని రాజా తన లేఖలో పేర్కొన్నారు.