Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిని ప్రశ్నించే హక్కు కాప్ పంచాయితీలకు లేదు : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులను భయ బ్రాంతులకు గురిచేస్తున్న కాప్ పంచాయితీలు, గ్రామ పెద్దలకు సుప్రీంకోర్టు హెచ్చ రించింది. వయోజనులైన యువతీ, యువకులు కులాంతర వివాహం చేసుకుంటే, వారిని అడ్డుకునే అధికారంకానీ, ప్రశ్నించే అధికారంకానీ కాప్ పంచాయితీలు, గ్రామ పెద్దలు, వ్యక్తులు, సమాజానికి లేదని స్పష్టంచేసింది. ఇలాంటి చర్యలను చట్టవిరుద్ధంగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కులాంతర వివాహాలు చేసుకునే వారిపై దాడులు, పరువు హత్యలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ చేసిన సలహాలు, సూచనలపై తన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తెలియచేయాలని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి ఐదో తేదీకి వాయిదావేసింది.కులాంతర వివాహాలు చేసుకున్న వధూవరులను వేరు చేయడమేకాకుండా, వారిపై దాడులకు పాల్పడిన ఘటనలూ గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పై హెచ్చరికలు చేసింది.