Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు వేల కోట్లు అవసరమని వినతి
- వార్షిక బడ్జెట్పై నేడు జైట్లీ అధ్యక్షతన సమావేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
సేద్యానికి యోగ్యమైన భూములు కలిగి ఉన్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఎక రాకు రూ.నాలుగు వేల పంట పెట్టుబడి పథకానికి నగదు కష్టాలు రానీయకుండా సహకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీకి రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు. కోటీ 42 లక్షల 12 వేల 8 వందల 70 ఎకరాలకు గాను సు మారు రూ. ఆరు వేల కోట్ల నగదు అవసరమని అంచనా వేశామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులకు సరిపడా నగదు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బిందు సేద్యం పరికరాలపై విధించిన 18 శాతం జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని విన్నవించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ ్జైట్లీని ఆయన కార్యాలయంలో కలిశారు. సమావేశానం తరం పోచారం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. 71 లక్షల 75 వేల మంది రైతులకు కోటీ 42 లక్షల 12 వేలా 8 వందలా 70 ఎకరాలు భూమి ఉందని చెప్పారు. ఇందుకు సుమారు ఐదు వేల ఐదు వందల కోట్ల నుంచి ఆరు వేల కోట్ల నగదు అవసరమని తెలిపారు. ఇదే విషయాన్ని జైట్లీకి వివరించి నగదు కష్టాలు తీర్చాలని కోరామని అన్నారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. రైతులకు ఎకరా నాలుగు వేలు చెక్కుల రూపంలో మే 1వ తేదీ నుంచి అందజేస్తామని తెలిపారు. ఇక బిందు సేద్యం పరికరాలపై రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున సబ్సిడీ అందజేస్తోందని అన్నారు. కాబట్టి వీటిపై విధించిన 18 శాతం జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని కోరారు. ఈ అంశాన్ని తాను పరిశీలిస్తానని జైట్లీ చెప్పారని పోచారం తెలిపారు.
నేడు కేంద్ర బడ్జెట్పై స్పష్టత....
2018-19 వార్షికబడ్జెట్పై నేడు రాష్ట్ర ఆర్థికమంత్రుల సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశముందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఉద యం కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమా వేశంలో పాల్గొన నున్నట్టు చెప్పారు. రాష్ట్ర సంక్షేమ కార్యక్రమాలకు పెద్దఎత్తున నిధు లు కేటాయించాలని ఈ వార్షిక బడ్జెట్ సమావేశంలో విజ్ఞప్తి చేయనున్నట్టు తెలి పారు. మంత్రుల వెంట తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్కుమార్ ఉన్నారు.