Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్పోర్టు నుంచి సబర్మతి ఆశ్రమం వరకు రోడ్షో
అహ్మదాబాద్: ఆరు రోజుల భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ బుధవారం గుజరాత్లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. నెతన్యాహూ, ఆయన భార్య సారా నెతన్యాహూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ కలిసి అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభ్భారు పటేల్ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం(8 కిలోమీటర్లు) వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ దారిలో దాదాపు 50 చోట్ల స్వాగత కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అహ్మదాబాద్ ముస్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ ప్రవీణ్ పటేల్ వెల్లడించారు.