Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్ణయించనున్న సీజేఐ దీపక్ మిశ్రా
న్యూఢిల్లీ : జస్టిస్ బిహెచ్లోయా మృతి కేసుపై మరోమారు విచా రణ జరగనున్నది. దేశ న్యాయ వ్యవస్ధలో ఇంతకుముందెన్నడూ లేనంత సంక్షోభం నెలకొనడానికి గల కారణాలలో జడ్జి బి.హెచ్.లోయ మృతి కేసు ఒకటి. జడ్జి లోయా మృతి కేసును తగిన ధర్మాసనం ఎదుట ఉంచా లని ఈ కేసును విచారణ జరిపిన ఇద్దరు న్యాయమూర్తులు మంగళ వారం పేర్కొన్నారు. దీనిని ఏ ధర్మాసనానికి బదిలీ చేయాలన్న విషయమై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నిర్ణయించాల్సి ఉంది. అయితే సుప్రీం కోర్టుకు చెందిన నలుగురు ప్రధాన న్యాయమూర్తులు ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి సుప్రీం కోర్టులో పాలనాతీరు గాడి తప్పిందంటూ హెచ్చరించిన విషయ తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్లోయా మృతి కేసును కూడా వారు ప్రస్తావించారు. అందువల్ల లోయా మృతి కేసుపై ఆ నలుగురు న్యాయమూర్తులలో ఎవరికి కూడా పునర్విచారణను అప్పగించే అవకాశం లేదు. లోయామృతి కేసు విచారణ రాజకీ యంగా చాలా సున్నితమైన అంశంగా మారింది. వీరికి బదులు ఈకేసు పునర్విచారణను జస్టిస్ అరుణ్ మిశ్రాతో సహా ఇద్దరు న్యాయమూర్తులకు అప్పగించే అవకాశాలున్నాయి. సుప్రీం కోర్టు అత్యంత సీనియర్ న్యాయమూర్తులలో జస్టిస్ అరుణ్ మిశ్రా పదో స్థానంలో ఉన్నారు. జస్టిస్ లోయ 2014 డిసెంబరులో నాగపూర్లో మృతి చెందారు. బీజేపీ అధ్యక్షులు అమిత్ షా నిందితుడుగా ఉన్న ఒక హత్య కేసుపై విచారణ జరుపుతున్న లోయా మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.