Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్
లక్నో: హజ్ సబ్సిడీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ముస్లింలనుమోసం చేసిందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మండిపడింది. హజ్ సబ్సిడీని ఎత్తివేస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన అర్థం లేనిదని ముస్లిం పర్సనల్ లాబోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా వాలీ రెహమాని విమర్శించారు. 'హజ్ యాత్రకు వెళ్ళేవారికి ఆ సబ్సిడీ ఇవ్వడంలేదు. ఎయిరిండియాకు మాత్రమే ప్రభుత్వం ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నది. సబ్సిడీ పేరుతో కంటి తుడుపు చర్యగా ముస్లింలను మోసం చేశారు. సాధారణ రోజుల్లో సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా విమాన టిక్కెట్ ధర రూ.32వేలు మాత్రమే. అదే హజ్ యాత్ర రోజుల్లో ఈ టిక్కెట్ ధర రూ.65వేల నుంచి రూ. లక్ష వరకూ ఉంటుంది. సబ్సిడీ లేకుండా ధరలు తగ్గించండి' అని రెహమాని డిమాండ్ చేశారు. సబ్సిడీ పేరుతో ప్రభుత్వాలు ముస్లింలను మోసగించాయ నడానికి ఇదే నిదర్శ నమని ఆయన అన్నారు. 'హజ్ యాత్రకు వెళ్ళేవారు ఒకేసారి బల్క్గా టిక్కెట్లను కొనుగోలు చేస్తారు. అందువల్ల చార్జీలు కూడా తక్కువగా ఉండాలి. ఎయిర్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్ నిబంధన ప్రకారం.. ఎవరైనా తీర్థయాత్రలకు వెళితే.. టిక్కెట్ ధరలో 40 శాతం డిస్కౌంట్ ఇస్తారు. చార్జీలు తగ్గించకపోవడం అలా వుంచితే.. సాధారణ రోజుల్లో ఉండే టిక్కెట్ ధరలైనా ఉండాలి' అని రెహమాని అన్నారు.
సబ్సిడి నిలిపివేత ఏకపక్ష నిర్ణయం: సీపీఐ(ఎం)
హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేయడం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని సీపీఐ(ఎం) పేర్కొం ది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని పదేళ్ళపాటు కొనసాగించాలని 2012లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్రం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించింది. ఇతర ప్రయోజ నాలను ఆశించే హజ్ యాత్రికులకు సబ్సిడీ రద్దు నిర్ణయం తీసుకున్న ట్టు తెలిపింది. లౌకిక సూత్రానికి అనుగుణంగా ఏ మతానికి చెందిన వారైనా మతపరమైన యాత్రలు చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వ డానికి గాని, నిధులు సమకూర్చడానికి గాని సీపీఐ(ఎం) వ్యతిరేకమని ఆ ప్రకటన పేర్కొంది.