Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో 100 కోట్ల రద్దయిన కరెన్సీ స్వాధీనం
- 16 మంది అరెస్టు
లక్నో: గుట్టలుగా పేర్చిన కట్టలు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద కోట్ల రూపాయలు.. రద్దయిన కరెన్సీని ఓ ఇంటిలో దాచి ఉంచిన వ్యవహారం అధికారుల దాడుల్లో బట్టబయలైంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ), పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తంలో రద్దయిన కరెన్సీ పట్టుబడింది. కరెన్సీ స్వాధీనం చేసుకొని, 16 మందిని అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు ఉన్నట్టు తెలుస్తున్నది. కొందరు వ్యక్తులు రద్దయిన కరెన్సీని ఓ చోట దాచి పెట్టి గుట్టుచప్పుడు కాకుండా మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తు న్నట్టు అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం తోనే ఈ దాడి జరిగినట్టు సమాచారం. కాన్పూర్లోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఎన్ఐఏ, పోలీసు బృం దాలు మంగళవారం రాత్రి సోదాలు చేశాయి. ఈ క్రమం లోనే ఆ ఇంటిలో దాచి ఉంచిన కరెన్సీని చూసి అధికా రులు సైతం బిత్తరపోవాల్సి వచ్చింది. స్వాధీనం చేసు కున్న కరెన్సీని లెక్కించగా రూ.100 కోట్లు ఉన్నదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
ఇవన్నీ రద్దయిన రూ.500, రూ.1000 నోట్లే కావడం గమనార్హం. పూర్తి మొత్తంలో ఎంత పట్టుబడిం దో తెలియాల్సి ఉన్నది. ఈ కరెన్సీలో బిల్డర్ ఆనంద్ ఖాత్రి దే ఎక్కువ మొత్తం ఉన్నదని సీనియర్ ఎస్పీ అఖిలేశ్ కుమార్ మీనా బుధవారం వెల్లడించారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016 నవంబర్ 8న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెద్దనోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఓ చోట ఇంత పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ వ్యవహారం వెనుక పలువురు సీనియర్ నేతల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తున్నది. నోట్ల మార్పిడి గడువు పూర్తయి చాలా రోజులైనా వాటిని ఇంకా మార్చడానికి ప్రయత్నించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. బ్యాంకుల అధికారుల ప్రమేయమేమైనా ఉన్నదా? అన్న కోణంలో కూడా ఎన్ఐఏ, ఐటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరింత మందిని అదుపులోకి తీసుకొనే అవకాశమున్నది. మరోవైపు.. కరెన్సీని దాచి పెట్టిన వ్యవహారం వెనుక ఉగ్రవాద హస్తం ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు రాలేదని అధికారులు చెబుతున్నారు.