Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత యువకుడిపై హిందూత్వశక్తుల దాడి
- ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఘటన
- సోషల్ మీడియాలో వైరల్
లక్నో: అధికారం అండ ఉన్నదన్న దీమాతో హిందూత్వ మూకలు రెచ్చిపోతున్నాయి. దేవుళ్లను అవమానించారని ఆరోపిస్తూ ఓదళిత యువ కుడిపై హిందూత్వవాదులు దాడికి తెగబడ్డారు. అంతేకాక.. అతడి తో బలవంతంగా 'జై శ్రీరామ్' అనిపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసుల వివ రాల ప్రకారం.. జిల్లాలోని మేఘాషికార్పూర్ గ్రామానికి చెందిన దళితుడు విపిన్కుమార్(22)పై కొందరు వ్యక్తులు ఈనెల 14న దాడికి తెగబడ్డారు. హిందూ దేవుళ్లని అవమానిస్తావా? అంటూ దూషణకు దిగారు. బలవం తంగా జైశ్రీరామ్ అనిపించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన విపిన్ కుమార్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ సోషల్మీడియాలో బుధవారం బహిర్గత మైంది.అయితే విపిన్కుమార్పై దాడికి పాల్పడిన నిందితులను గుర్తిం చామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని సీనియర్ ఎస్పీ అనంత్ దేవ్ వెల్లడించారు. ఓ నెల క్రితం గ్రామానికి చెందిన కొందరు దళితులు దేవుళ్ల విగ్రహాలు తొలగించినట్టు ఆరోపణలున్నాయి. వీరిలో విపిన్కుమార్ ఉన్నా డన్న అనుమానంతో ఈదాడి జరిగినట్టు తెలుస్తున్నది.