Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నినదించిన శ్రామిక జనం
- సమస్యలు పరిష్కరించాలని స్కీమ్ వర్కర్ల డిమాండ్
- ఢిల్లీలో మారుమోగిన నినాదాలు
- బడ్జెట్లో కేటాయింపులను బట్టి భవిష్యత్ ప్రణాళిక : నాయకులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతి రేక విధానాలను నిరసిస్తూ కార్మికలోకం కన్నెర్ర చేసింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ శ్రామిక లోకం ఎలుగెత్తి చాటింది. మోడీ సర్కార్ తమ గోస వినాలంటూ గళం విప్పింది. ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని కార్మికులు వీధుల్లోకి వచ్చారు. కార్మిక లోకాన్ని కట్టడి చేయడానికి బారికేడ్లు పెట్టి అడ్డుకునే ప్రయ త్నం చేసినా.. ఉద్యమబాటను ముందుకు నడిపించారు. తమ సమస్యల పరిష్కారం పట్ల మొండిగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు తీరును కార్మికసంఘ నాయకులు తీవ్రంగా విమర్శించారు. కార్మిక శ్రేయస్సును పట్టించుకోకపోతే బీజేపీ సర్కార్కు పుట్టగతులుండవని హెచ్చరిక చేశారు. అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఎన్సీఎల్పీ టీచర్లు, స్మాల్ సేవింగ్ ఏజెంట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథక కార్మికులంతా కదంతొక్కారు. దేశవ్యాప్తంగా సుమారు 60లక్షల మంది ఆయాజిల్లాల ప్రధాన నగరాల్లో ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలతో రోడ్డుకె క్కారు. ప్రధాన నగరాల్లో భారీనిరసన ప్రదర్శనలతో వాహ నాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తమ సమస్యల ను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతూ జిల్లా అధికారుల కు వినతిపత్రాలను అందచేశారు. 2017 నవంబరు 9-11 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మహాపడావ్ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలు స్కీమ్ వర్కర్ల 'దేశవ్యాప్త సమ్మె'కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
స్కీం వర్కర్ల డిమాండ్లు ఇవే..
స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి వారికి వర్తించే హక్కులు కల్పించాలి. సామాజిక భద్రత కింద ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి పథకాలను వర్తింప చేయాలి. నెలకు రూ.3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ వర్తింప చేయాలి. కనీస వేతనం నెలకు. రూ. 18 వేలు తక్కువ కాకుండా ఉండాలి. ప్రభుత్వ పథకాలను ప్రయివేటీకరించకూడదన్నది ప్రధాన డిమాండ్. 2018-19 కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్, ఎండీఎంఎస్, ఎన్హెచ్ఎం, ఎస్ఎస్ఏ, ఎన్సీఎల్పీ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలకు తగిన నిధులు కేటాయించాలని స్కీమ్ వర్కర్లు కోరుతున్నారు.
వివిధ రాష్ట్రాల్లో..
కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర యూనియన్లు ఈ సమ్మెకు మద్దతు పలికాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్; హర్యానా, హిమాచల్ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, ఒడిషా, పంజాబ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, యూపీ, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో సమ్మె విజయవంతంగా సాగింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ నెల 23న సమ్మెను నిర్వహించనున్నారు.
దేశ రాజధానిలో
దేశ రాజధాని ఢిల్లీలోని మండీ హౌస్ నుంచి పార్లమెం టు స్ట్రీట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ కార్మికులను పోలీసులు నిలువరించడంతో తోపులాట జరిగింది. బారికేడ్ల ను తోసుకుంటూ కార్మికులు కదం తొక్కారు. పార్లమెంటు స్ట్రీట్ వద్ద సభ నిర్వహించారు. ఈ సభలో ధీరేంద్ర శర్మ (ఏఐటీయూసీ), మంజీత్ రాజేందర్ (హెచ్ఎంఎస్), ఎఆర్ సింధు, ఉషారాణి, రంజన నిరుల, అనురాగ్ సక్సేనా (సీఐటీ యూ), సంతోశ్ రారు (ఏఐసీసీటీయూ), ఎం చౌరాసియా (ఏఐయూటీయూసీ) తదితరులు ప్రసంగించారు. అనం తరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీకి కార్మిక సంఘాల నాయకులతో కూడిన ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించింది. రానున్న కేంద్రబడ్జెట్లో నిధుల కేటాయిం పు, ప్రభుత్వ స్పందన ఆధారంగా భవిష్యత్ ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.