Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలహాబాద్ హైకోర్టు
లక్నో : ప్రధానమంత్రి కార్యాలయంపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అఫిడవిట్ దాఖలు చేయకపో వడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రూ.5000 జరిమానా చెల్లిం చాలని ఆదేశించింది. జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ అబ్దుల్ మోయిన్లతో కూడిన అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలు జారీ చేసింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన కేవలం పది నివేదికలపై మాత్రమే చర్యలు తీసుకున్నారని, మిగిలినవాటిని నిర్లక్ష్యం చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఏటా ప్రభుత్వానికి దాదాపు 5,000 కాగ్ నివేదికలు వస్తూ ఉంటాయని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కాగ్లో సంస్కరణలు తీసుకురావాలని కోరారు. దీంతోపాటు, గత పదేండ్లు గా కాగ్ లేవనెత్తిన ఆడిట్ అభ్యంతరాలపై ఎలాంటి చర్యా తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా స్పందన తెలియచేయాల్సిందిగా 2017 ఆగస్టు 1న పిఎంఓకు, న్యాయ మంత్రిత్వ శాఖకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. కాగా, గురువారం ఈ పిటిషన్ విచారణకు రాగా, అసిస్టెంట్ సాలిసిటర్ జనరల్ ఎస్బీ పాండే మరింత సమయం కావాల్సిం దిగా కోర్టును కోరారు. ఇప్పటికే సరిపడినంత సమ యం ఇచ్చామని, మరో అవకాశం కావాలని కోరడమే మిటని ధర్మాసనం ప్రశ్నించింది. అయినప్పటికీ మరొక అవకా శం ఇస్తున్నట్టు తెలిపింది. ఖర్చుల కోసం రూ.5,000 చెల్లించాలని పీఎంఓను ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.