Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉపరితలం నుంచి ఉపరితలంలోకిి దూసుకెళ్లే అణు సామర్థ్యం కలిగిన అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష గురువారం విజయవంతమైంది. ఒడిషాలోని బాలాసోర్లో ఉన్న అబ్దుల్ కలామ్ ద్వీపం నుంచి ఈ క్షిపణిని పరీక్షించగా.. నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం 9:53 నిమి షాలకు ఈ మిస్సైల్ను పరీక్షించినట్టు అధికారులు తెలిపారు. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువుండే ఈ క్షిపణి
5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సునాయసంగా చేధించగలదని వెల్లడించారు. అగ్ని సిరీస్లో మిగిలిన వాటి కన్నా ఈ క్షిపణి అత్యంత ఆధునిక సాంకేతికతను కలిగి ఉందని, నావిగేషన్, మార్గదర్శకత్వం, వార్హెడ్, ఇంజిన్ పరంగా నూతన సాంకేతిక విలువలను కలిగి ఉన్నదని పేర్కొన్నారు. అగ్ని-5ను పరీక్షించడం ఇది ఐదోసారి. ఇంతకుముందు దీనిని 2016 డిసెంబర్, 2015 జనవరి, 2013 సెప్టెంబర్, 2012 ఏప్రిల్లో దీనిని పరీక్షించగా అన్నిసార్లూ విజయవంతమైంది. మరికొన్ని పరీక్షల తర్వాత అగ్ని-5ను రక్షణాదళంలో ప్రవేశపెట్టనున్నారు.