Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాణా కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తి శివపాల్
రాంచీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు మూడున్నరేండ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సీబీఐ జడ్జి శివపాల్ సింగ్ కుటుంబం రివాల్వర్ లైసెన్సు పొందడం కోసం దరఖాస్తు చేసుకుంది. పశుదాణా కుంభకోణం కేసులో లాలూకు మూడు న్నరేండ్ల శిక్ష విధిస్తూ జనవరి 6న ఆయన తీర్పునిచ్చారు. శివపాల్, ఆయన కుమారుడు, కుమార్తె రివాల్వర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని అధికా రిక వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. రాంచీలోని కేంద్ర కారాగారంలో లాలూ జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.