Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి బి.హెచ్.లోయా కేసుకు సంబంధించి ఈ నెల 22న సుప్రీంకోర్టు వాదనలు విననుంది. రోస్టర్ విధానంపై ఆ సమయానికి నియమితులైన న్యాయమూర్తులు ఈ కేసును విచారిస్తారని.. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. కాంగ్రెస్ నాయకుడు పూన్వాలా, మహారాష్ట్ర జర్నలిస్టు బి.ఎస్.లోనె ఈ కేసును విచారించాలని పిటిషన్ దాఖలు చేశారు. లోయా మృతికి సంబంధించిన కేసుని 'తీవ్రమైన అంశం'గా భావిస్తూ సంబంధిత డాక్యుమెంట్లన్నింటినీ (పోస్టుమార్టం రిపోర్టుతో సహా) ఏడు రోజుల్లోగా న్యాయస్థానం ముందుంచాలని ఈ నెల 16న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విదితమే.