Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముజఫర్నగర్ అల్లర్ల కేసు..
ముజఫర్నగర్: ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్ అల్లర్ల కేసుతో సంబంధమున్న కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ సంజీవ్ బాల్యన్, ఎమ్మెల్యే ఉమేష్ మాలిక్లు కోర్టులో శుక్రవారం హాజరయ్యారు. వారిద్దరి పై నాన్ బెయిలెబుల్ వారెంట్లు జారీ చేయడంతో వారు కోర్టు ముందు హాజరయ్యారు. కాగా తదుపరి విచారణకు ఈ నెల 29న కోర్టులో హజరవ్వాలని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేటు మధు గుప్తా వారిని ఆదేశించారు. ఒక్కో నిందితుడి పై 30వేల రూపాయల బాండ్లు నమోదు చేశారు. 2013 ఆగస్టులో మహాపంచాయతీ ఎన్నికల్లో సంజీవ్ బాల్యన్, ఉమేష్లు తమ రెచ్చగొట్టే ప్రసంగాలతో రెండు వర్గాల మధ్య మత ఘర్షణకు కారకులయ్యారు. ముజఫర్ నగర్, చుట్టుపక్కన ప్రాంతాల్లో చెలరేగిన మత ఘర్షణల్లో 60 మంది ప్రజలు చనిపోగా 40వేల మంది నిర్వాసితులయ్యారు.