Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ సిటీ మిషన్లో మరో 9 నగరాలను చేరాయి. వీటిలో మూడు ఉత్తర ప్రదేశ్లోనివేనని కేంద్ర హౌసింగ్, అర్బన్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం తెలి పారు. దీంతో ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికి 99 నగరా లు చేరాయని ఆయన చెప్పారు. స్మార్ట్ సిటి మిషన్ పథకం కింద ఎంపికైన నగరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల చొప్పన ఖర్చు చేయనున్నది. ఈ నిధులతో వివిధ ప్రాజె క్టులను అమలు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ సిటీ మిషన్ పథకం కింద నాలుగో విడతలో ఎంపికైన నగరాలలో ఉత్తర ప్రదేశ్ లోని బరేలి, మోర్దాబాద్, సహరాన్పూర్, తమిళనాడు లోని ఎరోడ్, బీహార్లోని బీహార్ షరీఫ్, దాద్రానగర్ హవేలీ లోని సిలవాస, డామన్ అండ్ డయ్యూలోని డయూ, లక్షద్వీప్ లోని కవర్తి, అరుణాచల్ప్రదేశ్లోని ఇటానగర్ ఉన్నాయి.