Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మహిళలు ఆస్పత్రికి తరలింపు
- వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు..
పనాజి: అమ్మోనియా వాయువును తరలిస్తున్న లారీ ట్యాంకర్ బోల్తాపడి గ్యాస్ లీక్ అయిన ఘటన గోవాలో వాస్కో పట్టణంలోని చికాలిమ్ గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 2.45 గంటలకు చోటుచేసుకుంది. వాస్కో పట్టణంలోని మార్ముగావ్ పోర్ట్ ట్రస్టు నుంచి జువారి ఇండిస్టీస్ లిమిటెడ్కు అమ్మోనియా గ్యాస్ను తరలిస్తుండగా వాస్కో-పనాజీ హైవేపై ఈ ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలంలో 300నివాసాలుండగా వందలాది మంది స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విపత్తు నివారణ బృందాలను ప్రమాద స్థలానికి వెంటనే పంపించామని జిల్లా డిప్యూటీ కలెక్టర్ మహాదేవ్ అరోందేకర్ తెలిపారు. అక్కడి స్థానికులను నిద్రలేపి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు పోలీస్, అగ్నిమాపక అధికారులను ఆదేశించామని ఆయన చెప్పారు. ఘటనాస్థలానికి సమీపంలో ఉంటున్న ఇద్దరు మహిళలకు లీకయిన విషవాయువు వలన ఊపిరాడకపోవడంతో వెంటనే దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తరలించామని జిల్లా సీనియర్ పాలనాధికారి ఒకరు తెలిపారు. ఈ హైవే గుండా వాహనాల రాకపోకలను నిలిపివేసి వేరే మార్గాలకు మరలించామని పోలీసు ఇన్స్పెక్టర్ నొలాస్కో రాపొసొ తెలిపారు.