Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: కర్నా టకలోని బెల్లందుర్ సరస్సులో మరోసారి మంటలు వ్యాపించి పరిసర ప్రాంత మంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. శక్ర వారర ఉదయం ఈ పొగలు వ్యాపిం చినట్టు అధికారులు తెలి పారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో సరస్సు పరిసర ప్రాంతమంతా మేఘాలతో కప్పివేయబడ్డట్టు ఉండటంతో స్థానికులు భయాందోళనలకు లోనై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది వెంటనే మంటల్ని అదుపు చేసినా పొగలు మాత్రం ఆగలేదు. ఈ ఘటనకు సంబంధించి కారణాలేమీ తెలియరా లేదని అధికారులు తెలి పారు. ఈ సరస్సులో మంటలు వ్యాపించడం ఇది మూడోసారి. గతేడాది ఫిబ్రవరి 16, మే 7న భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. బెంగళూరు నడిబొడ్డున 700 ఎకరాల్లో విస్తరించి ఉన్న బెల్లందుర్ సరస్సు పరిసర ప్రాంతాల చుట్టూ ఉన్న రసాయన కంపెనీల వ్యర్థాలు, ఇతర ఉద్గారాలు కలుస్తుండటంతో ఈ సరస్సు కలుషితమయమైంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సరస్సును శుద్ది చేయాలని గతేడాది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా ఇప్పటికీ చర్యలేమి చేపట్టకపోవడం గమనార్హం.