Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్: రాజస్థాన్లో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)పై అభ్యర్థుల ఫొటోలుంటాయని ప్రధాన ఎన్నికల అధికారి అశ్వనిభగత్ శుక్రవారం తెలిపారు. అజ్మీర్, అల్వార్ పార్ల మెం టరీ స్థానాలకు, మందల్ఘర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 29న జరగే ఉప ఎన్నికల్లో ఈవిధానాన్ని అమలు చేయనున్నారు. గతేడాది రాజస్థాన్ లోని ధోన్పూర్ ఉపఎన్నికల్లో ఇదే విధానాన్ని అనుసరిం చారు. ఈవీఎస్ పద్ధ్దతిలో ఫోటోను ఉంచడం ద్వారా ఒకే పేరు గల అభ్యర్థులతో ఎలాంటి సమస్య ఉండ దని భగత్ అన్నారు. 2.5సెంటిమీటర్ల సైజు గల అభర్థు ల ఫోటోలను ఈవీఎంల పై ఉంచనున్నట్టు తెలిపారు. ఎన్నిక గుర్తుతో పాటు పేరు, ఫోటో కూడా ఉంటుందన్నారు. మొత్తం మూడు స్థానాల్లో 39లక్షల మంది ఓటర్లు తమ ఓటును వినియోగించకోను న్నారని ఆయ న తెలిపారు. అల్వార్లో 18.27లక్షలు, అజ్మీర్లో 18.42 లక్షలు, మంద ల్ఘర్లో 2.31 లక్షల ఓటర్లు ఉన్నారు. మొత్తం మూడు ప్రాంతాల్లో కలిపి 4,166 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయను న్నట్టు తెలిపారు.