Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ: అతను బురద తిన్నాడంటే బుద్ధి గడ్డి తిన్నదేమో అనుకుంటాం. కానీ పేదరికమే బురద తినిపిం చిందతన్ని. జీవించేందుకు కనీస స్థోమత లేక చచ్చిపోదా మనుకున్నాడతను, కానీ జీవించాలనే తపనతో ఎలాగైనా బతకాలని నిశ్చయించుకున్నాడు. తినేందుకు తిండిలేక కడుపు నకనకలాడుతుంటే పదకొండేండ్ల ప్రాయంలోనే బురద తినేందుకు సిద్ధమయ్యాడు. అతనే జార్ఖండ్లోని సాహెబ్గంజ్కు చెందిన కరు పాశ్వాన్(99). పేదరికం వల్ల పదకొండేండ్ల నుంచే తాను బురద తింటున్నానని పాశ్వాన్ చెప్పాడు. తన 10మంది పిల్లలకు ఆహారాన్ని అందించడం మరింత జఠిల సమస్యగా మారడంతో బురద తినడం అలాగే కొనసాగింద న్నారు. ఆర్థిక స్థోమతలేక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడని అన్నారు. కానీ బురద అయినా తిని బతికాలని నిర్ణయించుకున్నాను' అని తెలిపారు. క్రమంగా ఇది అలవాటుగా మారిందని చెప్పారు. రోజుకు కిలో బురదను తింటానన్నారు. బురద తినవద్దన పాశ్వాన్ను వారించినా మానడం లేదని ఆయన తనయుడు సియారాం పాశ్వాన్ తెలిపారు. బురద తింటున్నా, పాశ్వాన్ ఆరోగ్యంగా ఉండడం గమనార్హం.