Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
ఢిల్లీ: హర్యానాలో మహిళలపై జరు గుతున్న లైంగికదాడులను నియంత్రిం చడం, చైనా డోక్లామ్ వివాదం, ఉద్యోగాల కల్పనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అడిగారు. ఈనెల 28న జరగబోయే నరేంద్ర మోడీ మన్కీబాత్లో ''ఎన్ఎం యాప్'' ద్వారా ప్రజలు సలహాలు సూచనలు ఇవ్వాలని ట్వీట్ చేశారు. దీనికి రాహుల్గాంధీ స్పందిస్తూ హర్యానా ఘటనలను, డోక్లామ్, ఉద్యోగాల కల్పనపై మోడీ తన కార్యక్రమంలో ప్రజలనే అడిగి తెలుసుకోవాలని శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. బీజేపీ పాలిత ప్రాంతమైన హర్యానా మహిళలపై జరుగుతున్న లైంగికదాడులపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.