Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశాభావం వ్యక్తం చేసిన పర్యాటక పరిశ్రమ
ఆగ్రా: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెత న్యాహు తాజ్మహల్ సందర్శనానంతరం ఆగ్రాకు ఆ దేశం నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగనుందని పర్యాటక పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేసింది. 2016లో ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ర్యువెన్ రివ్లిన్ ఆగ్రాను సందర్శించారు. ఆ ఏడాది దేశంలో ఇజ్రా యిల్ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈఏడాది ఆదేశ ప్రధాని నెతన్యాహు పర్యటనానం తరం ఇజ్రాయిల్ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా. ఇజ్రాయెల్ దేశపు ఇద్దరు ప్రధాన నాయకుల ఆగ్రా సందర్శనానంతరం ఆ దేశం నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుం దని పర్యాటక సంక్షేమ చాంబర్ అధ్యక్షుడు ప్రహ్లాద్ అగర్వాల్ శుక్రవారం తెలిపారు. అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం.. 2014లో ఇజ్రాయెల్ పర్యాట కుల సంఖ్య 49,314 ఉండగా, 2015లో ఆ సంఖ్య 50,134కు పెరిగింది. 2016లో ఆ దేశ అధ్యక్షుని పర్యటనానంతరం పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో గతేడాది ఇజ్రాయెల్ దేశ పర్యా టకుల సంఖ్య 59,231 కి పెరిగింది. 2000 ఏడాది లో 15,900 మంది ఇజ్రాయిల్ పర్యాటకులు ఆగ్రా ను సందర్శించగా, 18 ఏండ్లలో అది 400 శాతానికి పెరిగింది. ఇదే విధంగా కొనసాగితే తాజ్ మహల్ను సందర్శించే పర్యాటకుల్లో ఇజ్రాయెల్ ప్రథమ స్థానంలో ఉండనుందని ఆయన తెలిపారు. రెండేండ్ల క్రితం ఫేస్బుక్ వ్యవస్థాకపకుడు మార్క్ జుకర్బర్గ్ తాజ్మహల్ సందర్శన తర్వాత ప్రముఖులందరికి ఇది ప్రధానాకర్షణగా మారిందన్నారు. అలాగే బ్రిటి షు యువరాణి డయానా.. తాజ్ సందర్శనతో ఆ దేశ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆగ్రా ను సందర్శించే వారిలో 14.73శాతంతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 10.70 శాతంతో బ్రిటన్ పర్యాటకులు రెండో స్థానంలో ఉన్నారు.